
గాలి, వాన బీభత్సం..
ఆత్మకూర్: మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు పలు గ్రామాల్లో వరి పంటలు నేలవాలగా.. మామిడి కాయలు టన్నుల కొద్ది రాలిపోయాయి. ఆరేపల్లిలో రైతు దేవన్న మామిడితోటలో రెండు టన్నుల కాయలు రాలిపోవడంతో రూ.1.10 లక్షల నష్టం వాటిల్లింది. అలాగే రామచంద్రయ్య తోటలో 4 టన్నులు, వెంకటన్న తోటలో 5 టన్నులు, రామకృష్ణారెడ్డి తోటలో టన్ను, అడవి నర్సింహులు తోటలో టన్ను మామిడి కాయలు రాలిపోయాయి. అలాగే వరిపంట నేలకొరిగి ధాన్యం రాలిపోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు విరిగిపడటంతో గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.