
ఈదురు గాలుల వర్షం
వీపనగండ్ల: మండలంలో ఆదివారం రాత్రి కురిసిన ఈదురు గాలుల వర్షానికి సుమారు వెయ్యి ఎకరాల మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. గోవర్ధనగిరిలో 100 ఎకరాలు, వీపనగండ్లలో 200, కల్వరాలలో 200, సంగినేనిపల్లిలో 150, తూంకుంటలో 100, రంగవరంలో 50 ఎకరాలతో పాటు వివిధ గ్రామాల్లో చేతికొచ్చిన మామిడి కాయలు నేలరాలాయి. ఈ విషయమై మండల ఉద్యాన అధికారి కృష్ణ మాట్లాడుతూ.. 560 ఎకరాల మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామని, 290 మంది రైతులు నష్టపోయారని 33 శాతం నష్టం వాటిల్లిన తోటలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.
మామిడి రైతులకు నష్టం