వైభవం.. మహాకుంభాభిషేకం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. మహాకుంభాభిషేకం

Jun 9 2025 7:01 AM | Updated on Jun 9 2025 7:03 AM

తిరుత్తణి: తిరుత్తణిలో కోదండరామస్వామి ఆలయ మహాకుంభాభిషేకం ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా చేపట్టి సీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. తిరుత్తణిలోని జ్యోతిస్వామి వీధిలో పురాతన సీతారాములు, లక్ష్మణ, హనుమాన్‌ సమేత కోదండరామస్వామి ఆలయం పునరద్ధరణ పనుల కోసం భక్తులు నుంచి విరాళాలు సేకరించి రూ.70 లక్షల వ్యయంతో ఆలయ గర్భగుడి గోపురం సర్వాంగసుందరంగా నిర్మించారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తికావడంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మహాకుంభాభిషేకం వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా భట్టాచార్యుల బృందం హోమగుండ పూజలు చేశారు. ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతి హోమం అనంతరం మేళ తాళాలు నడుమ పవిత్ర పుణ్యతీర్థాల కలశాలు బయల్దేరి విమాన గోపుర కలశాలకు మహాకుంభాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద గుమిగూడిన భక్తజనం గోవిందనామస్మరణతో స్వామిని దర్శించుకున్నారు. భక్తులపై బట్టాచార్యులు పుణ్యతీర్థాలు వెదజల్లారు. అనంతరం స్వామివారికి అభిషేక పూజలు చేసి సీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణాన్ని తిలకించారు.

విద్యుత్‌షాక్‌తో

వృద్ధురాలి మృతి

అన్నానగర్‌: విద్యుత్‌షాక్‌తో ఓ వృద్ధురాలు మృతిచెందింది. చైన్నె వ్యాసార్పాడి సత్యమూర్తినగర్‌ 18వ బ్లాక్‌ ప్రాంతానికి చెందిన నిర్మలాదేవి (60) ఒంటిరిగా జీవిస్తూ అడయార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తోంది. ఈ స్థితిలో శనివారం రాత్రి నిర్మలాదేవి ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు అనుమానించారు. సమాచారం అందుకున్న వ్యాసార్పాడి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలం లోపలికి వెళ్లి పరిశీలించారు. నిర్మలాదేవి స్నానం చేయడం కోసం వాటర్‌ హీటర్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌ తో మరణించిందని పోలీసుల పరిశీలనలో తేలింది. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం స్టాన్లీ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సీతా కల్యాణం వేడుకలో నిర్వాహకులు, పండితులు

కొరుక్కుపేట: చైన్నె పెరంబూర్‌లోని శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. పెరంబూర్‌, పటేల్‌ రోడ్డులోని ఆనంద నిలయం వేదికగా ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభమైన వసంతోత్సవాల్లో భాగంగా ముగింపు కార్యక్రమంగా ఆదివారం సీతా కల్యాణ వైభవాన్ని ఆనంద్‌ భాగవతార్‌ బందం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగిన ఈ కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు సీతారాములను స్మరించుకుని తరించారు. ఆనంద భాగవతార్‌ బృందం, స్వాగత సస్సంగం బృందాల కళాకారులు రామనామ కీర్తనలతో భక్తిని చాటుకున్నారు. సమాజం అధ్యక్షుడు తమ్మినేని బాబు, కార్యదర్శి ఎస్‌.వెంకట రామన్‌, జాయింట్‌ సెక్రటరీలు అనంతరామన్‌, రవికుమార్‌, కోశాధికారులు పి.కోదండరామయ్య, హెచ్‌.వెంకట రమణులు, ట్రస్టీ రామచంద్రన్‌ పాల్గొన్నారు.

వైభవం.. మహాకుంభాభిషేకం 1
1/2

వైభవం.. మహాకుంభాభిషేకం

వైభవం.. మహాకుంభాభిషేకం 2
2/2

వైభవం.. మహాకుంభాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement