
శ్రీరామ్ హనుమాన్ను డైరెక్ట్ చేశారా?
తమిళసినిమా: ఆరంజ్ పిక్చర్స్ పతాకంపై రాజేష్ పద్మనాభన్, సుజాత రాజేష్ కలిసి నిర్మించిన చిత్రం వానరన్. ‘టూ’ చిత్రం ఫేమ్ శ్రీరామ్ పద్మనాభన్ కథ, కథనం, మాటలు రాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా ప్రఖ్యాత దివంగత నటుడు నాగేష్ మనవడు, బిజేశ్ కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. నటి అక్షయ నాయకిగా నటిస్తున్న ఇందులో లొల్లు సభ జీవ, దీపా శంకర్, ఆదేశ్ బాల, నాంజిల్ విజయన్, ఎస్ఎల్ బాలాజీ, బేబీ వర్ష, వెంకట్ రాజ్, శివగురు, రామ్ రాజ్, వెడికన్నన్, రంగస్థలం నటు లు నామక్కల్ విజయకాంత్, జూనియర్ టీఆర్ ముఖ్యపాత్రలు పోషించారు. నీరన్ చందర్ చాయాగ్రహణం, షాజహాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. ఇందులో మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, దర్శకుడు పేరరసు, నటి కస్తూరి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిత్ర ఆడియోను ఆవిష్కరించిన తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ ఈ సినీ వేదిక తనకు అరుదు అని, రాజకీయ వేదిక ఆశ అయినదని పేర్కొన్నారు. అయినా తమిళిసై లేకుండా సినిమాలు లేవన్నారు. చాలా కాలం తర్వాత ఒక సినిమా ఆడి యో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చానని పేర్కొన్నారు. రాజేష్ పద్మనాభన్, సుజాత రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించాలని, వారు ఈ చిత్రాలు ఎలా నిర్మించారు? అని ఆలోచించినప్పుడు వారు ఉండేది రామాపురం అని, రా మాపురం నుంచి వచ్చిన రాజేష్ పద్మనాభన్, సుజాత రాముని భక్తుడైన హనుమాన్ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషమన్నారు. ఈ వేడుకకు తాను రాజకీయ నాయకురాలిగాను, మాజీ గవర్నర్ గాను రాలేదని, హనుమంతుని భక్తురాలిగా వచ్చాన ని పేర్కొన్నారు. కానీ కార్యక్రమానికి రప్పించిన ఆ హనుమంతుడే ఈ చిత్రానికి మంచి విజయా న్ని అందించాలని వేడుకుంటున్నాన న్నారు. ఈ చిత్రం దర్శకుడు పేరు శ్రీరామ్ అని శ్రీరాముని భక్తుడైన హనుమాన్ను ఈయన దర్శకత్వం వహించారా? లేక హనుమంతుడే శ్రీరామన్ డైరెక్ట్ చేశారా? అన్నది తెలియదు గానీ, ఈ చిత్రం మాత్రం సరైన డైరెక్షన్లో రూపొందిందని తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.