
కల్తీసారా విక్రయాలపై ఉక్కుపాదం
తిరువళ్లూరు: కల్తీసారా విక్రయం, అక్రమరవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ ప్రతాప్ అధికారులను ఆదేశించారు. తిరువల్లూరు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో కల్తీసారా అక్రమ రవాణా, విక్రయం, గుట్కా, గంజాయి విక్రయిస్తున్నారు. ఈక్రమంలో మత్తుపదార్తాలు, కల్తీసారా అక్రమ రవాణా విక్రయంపై తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ ఉన్నతాధికారులతో సమిక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దులో వాహనాల తనిఖీలను ముమ్మరం చేయడం, కల్తీసారా, గంజాయి విక్రయించే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రా నుంచి కల్తీసారా ఎక్కువగా జిల్లాలోకి అక్రమ రవాణా జరుగుతోందన్నారు. కల్తీసారా తీసుకోవడం వల్ల మనుషుల ప్రాణాలను ముప్పు ఏర్పడే అవకాశం వున్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.