
అపోలో, ఎస్ఆర్యూల విద్యా ఒప్పందం
సాక్షి, చైన్నె: జన్యుశా స్త్రం (జినోమిక్స్)లో ప్ర త్యేక కోర్సు ప్రవేశపెట్టే దిశగా అపోలో హెల్త్ రిసోర్సెస్ లిమిటెడ్ (ఏహెచ్ఎర్ఎల్), పో రూరులోని శ్రీరామచంద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్ఆర్యూ) మధ్య ఒప్పందాలు జరిగా యి. దీని ఆధారంగా అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ఇన్ జినోమిక్స్ (ఏసీజీ) ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టా యి. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరం ఫుల్టైమ్ కోర్సు ఆగస్టు నుంచి శ్రీరామచంద్రా వర్సిటీలో ప్రారంభమవుతుంది. ఈ కోర్సులో చేరడానికి ఎ మ్మెస్సీ, ఎంటెక్ విద్యార్హతగా నిర్ణయించారు. అభ్య ర్థులు హ్యూమన్ జెనిటిక్స్, బయోమెడికల్ జెని టిక్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ సైన్సెస్, స్టెమ్సెల్ సైన్సెస్, క్లినికల్ రిసెర్చ్, జెనెటిక్ ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ, బయోకెమెస్ట్రీ పాఠ్యాంశాల్లో ఏదైనా ఒకటి తప్పక చదివి ఉండాలని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ రెండు సంస్థలు ఒప్పంద కార్యక్రమంలో శ్రీరామచంద్రా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఉమ, అపోలో నాలెడ్జ్ సీఈఓ శివరామకృష్ణన్ వెంకటేశ్వరన్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సెంథిల్ కుమార్, హ్యూమెన్ జెనెటిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.వెంకటాచలం పాల్గొన్నారు.