ఘనంగా మొగప్పేర్‌ తెలుగు అసోసియేషన్‌ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మొగప్పేర్‌ తెలుగు అసోసియేషన్‌ వార్షికోత్సవం

Jun 3 2025 2:16 PM | Updated on Jun 3 2025 2:16 PM

ఘనంగా మొగప్పేర్‌ తెలుగు అసోసియేషన్‌ వార్షికోత్సవం

ఘనంగా మొగప్పేర్‌ తెలుగు అసోసియేషన్‌ వార్షికోత్సవం

కొరుక్కుపేట: చైన్నె మొగప్పేర్‌ తెలుగు కల్చరల్‌ అండ్‌ సోషల్‌ అసోసియేషన్‌ 12వ వార్షికోత్సవం ఘ నంగా నిర్వహించారు. చైన్నె అన్నానగర్‌లోని చిన్నస్వామి కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి జరి గిన ఈ వేడుకలకు అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ గిరి హనుమంతరావు సారథ్యం వహించగా, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వి.వీరభద్రరావు స్వా గతం పలికారు. ముఖ్యఅతిథులుగా ఏఐటీఎఫ్‌ అ ధ్యక్షుడు డాక్టర్‌ సీఎంకే రెడ్డి, గౌరవ అతిథులుగా ఏఐటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.నందగోపాల్‌, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా డిప్యూటీ డైరెక్టర్‌ జె.విజయలక్ష్మి, హైకోర్టు అడ్వకేట్‌ వి.దీపన్‌ రాజ్‌కృష్ణ, సీనియర్‌ అడ్వకేట్‌ రవీంద్రనాథ్‌, జేఎం నాయుడు తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మాతృభాషను మరవద్దని, మాతృభాషలోనే తమ పిల్లలను చదివించాలన్నా రు. అనంతరం ఖేల్‌ ఇండియా పోటీ ల్లో రాణించిన క్రీడాకారుడిని, పది, ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ జ్ఞాపికలతో సత్కరించారు. మొగప్పేర్‌ ప్రాంతంలోని పెద్దలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎన్‌.నిర్మల్‌ చంద్‌, ఎగ్జిక్యూటివ్‌ కమి టీ సభ్యులు ఈక్కుర్తి సురేష్‌ బాబు పాల్గొన్నారు. సోసియేషన్‌ ఉపాధ్యక్షుడు టీఎంకే కుమార్‌ వందన సమర్పణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement