
స్కూల్కు జనరేటర్ వితరణ
సాక్షి, చైన్నె: తిరునిండ్రవూరు నాచ్చియార్ చత్రంలోని వివేకానంద ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్, శ్రీమతి కృష్ణ మోల్చంద్మహేశ్వరి వివేకానంద విద్యాలయంకు 62 కిలోవాట్స్ జనరేటర్లను ఆర్సీఎంటీ విరాళంగా అందజేసింది. బుధవారం ఈ జనరేటర్లను ఆ విద్యాలయంలో అమర్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాసు టీనగర్ అధ్యక్షుడు నరేంద్ర శ్రీమల్, నిర్వాహకులు విపిన్ అగర్వాల్, వసుధా రాజశేఖర్, డాక్టర్ మహాలక్ష్మి, కపిల్ మహేశ్వరి, శివరామన్, అర్జున్ ఆదికేశవన్, విద్యార్థులు హాజరయ్యారు.