● రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి
అల్లూరు: కూటమి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని మారుతీకాలనీ, అల్లూరుపేట సత్రం, బీసీ కాలనీ, రజక కాలనీ, కోనేటి సత్రంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు అమలు చేయలేని హామీలను మేనిఫెస్టోలో ప్రకటించాడన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరు వైఎస్సార్సీపీ ప్రభుత్వమన్నారు. చేయగలిగిందే జగనన్న చెబుతారన్నారు. బాబు అధికారంలో ఉన్న సమయంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీని మేనిఫెస్టోను చూసి ఎవరూ మోసపోవద్దన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో కందుకూరు పరిశీలకుడు మన్నెమాల సుకుమార్రెడ్డి, నాయకులు నీలం సాయికుమార్, బాలకృష్ణంరాజు, దైవాదీనం, ఇస్మాయిల్, సురేష్రెడ్డి, ఉస్మాన్, రసూల్, ఆంజనేయరాజు, జిలానీ, మాబాషా, జంషీర్, కోటి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
20 కుటుంబాల చేరిక
మారుతీకాలనీలో టీడీపీకి చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వారికి రామిరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు.