రూ.11 లక్షలకు రైతుబజార్‌ వేలం | - | Sakshi
Sakshi News home page

రూ.11 లక్షలకు రైతుబజార్‌ వేలం

May 30 2025 7:00 AM | Updated on May 30 2025 7:00 AM

రూ.11 లక్షలకు రైతుబజార్‌ వేలం

రూ.11 లక్షలకు రైతుబజార్‌ వేలం

పహాడీషరీఫ్‌: జల్‌పల్లి మున్సిపాలిటీ రైతుబజార్‌ వేలంలో రూ.11,03,500కు పలికింది. మున్సిపాలిటీ కమిషనర్‌ బి.వెంకట్‌రామ్‌ సమక్షంలో గురువారం నిర్వహించిన ఈ వేలంలో ఆరుగురు సీహెచ్‌ నవీన్‌ గౌడ్‌, మహ్మద్‌ అలీ, ఎస్‌.కె.అమీర్‌, బి.నాగభూషణం, ఎండీ జ మీయువద్దీన్‌లు ముందుకు రావడంతో వేలం నిర్వహించగా రూ .11,03,500లకు మహ్మద్‌ అలీ దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా కమిషన ర్‌ మాట్లాడుతూ.. రైతుబజార్‌ దక్కించుకున్న వారు వచ్చే ఏడాది మే 31వ తే దీ వరకు వీధి వ్యాపారుల వద్ద రుసుంను వసూలు చేసుకునేందుకు అవకా శం ఉంటుందన్నారు. తాము సూచించనంత మేరకే వ్యాపారుల నుంచి డ బ్బులు వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి జ్యో తి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ భానుచందర్‌, మహ్మద్‌ మస్తాన్‌ వలీ పాల్గొన్నారు.

బెదిరిస్తున్న యువకుడిపై ఫిర్యాదు

ఫిలింనగర్‌: నన్ను కాదంటే నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తానంటూ బెదిరించిన మాజీ ప్రియుడిపై ఓ యువతి ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..షేక్‌పేట ఓయూ కాలనీలో నివసించే ప్రముఖ డిజైనర్‌ (26) ఓ బొటిక్‌ నడుపుతున్నది. ఆమెకు 2024లో అభిలాష్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. అయితే ఇద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అప్పటి నుంచి నిందితుడు అభిలాష్‌ ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. ఆమె ఫొటోలను స్నేహితులకు పంపుతూ ప్రతిష్టను దిగజార్చసాగాడు. ఆమె ఫ్లాట్‌ వద్ద అనుమానాస్పదంగా తిరగడంతో పాటు జుమాటో డెలివరీ బాయ్‌గా అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశిస్తూ ఆమె ఫ్లాట్‌ వద్దకు వచ్చి డెలివరీ ఆర్డర్‌ తీసుకోవాలంటూ వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె రెండు రోజుల క్రితం అభిలాష్‌ సోదరుడి దృష్టికి తీసుకువెళ్లింది. వారు పట్టించుకోలేదు. తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ అభిలాష్‌ మళ్లీ బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడసాగాడు. నిందితుడి వల్ల తాను బొటిక్‌ నడపలేకపోతున్నానని, వ్యాపారం దెబ్బతిన్నదని, పూర్తి నష్టాల్లో ఉన్నానని, తన పెళ్లి కూడా ఇతని చేష్టల వల్ల ఇబ్బందులకు గురవుతున్నదని ఆరోపిస్తూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్‌ పోలీసులు నిందితుడు అభిలాష్‌పై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 78 (2), 336 (4), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పెళ్లి చేసుకోపోతే సూసైడ్‌ చేసుకుంటానంటూ బెదిరింపు

ఫిలింనగర్‌: తనను పెళ్లి చేసుకోపోతే సూసైడ్‌ చేసుకుంటానంటూ ఓ యువకుడు బెదిరించడమే కాకుండా ఆమె కళ్లముందే బ్లేడ్‌తో చేతిని కట్‌ చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఘటన ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌ నగర్‌లో నివసించే యువతి (24) జూబ్లీహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌ వెంకటగిరికి చెందిన ఎన్‌.అరవింద్‌ అనే దూరపు బంధువుతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా..వారి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో రెండు కుటుంబాలు ఒప్పుకోకపోతే తాను పెళ్లి చేసుకోనని యువతి చెప్పింది. ఆగ్రహించిన అరవింద్‌ గత మూడు నెలలుగా ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె తిరస్కరిస్తూ వస్తున్నది. దీంతో ఆమె పనిచేస్తున్న ఆస్పత్రి వద్దకు కూడా రోజూ వెళ్తూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయసాగాడు. బుధవారం రాత్రి ఆమె విధులు ముగించుకుని ఆస్పత్రి పార్కింగ్‌ స్థలంలోకి వచ్చి స్కూటీ తీసుకుంటుండగా, అక్కడికి వచ్చిన అరవింద్‌ ఆమెను అడ్డుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని మరోసారి ఒత్తిడి చేశాడు. ఆమె కుదరదని చెప్పడంతో జేబులో ఉన్న బ్లేడ్‌ తీసి చేతిని కోసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఇక్కడే సూసైడ్‌ చేసుకుంటానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్‌ పోలీసులు నిందితుడిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 78 (2), 351 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement