ప్రభుత్వ కళాశాలలోనే చేరాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కళాశాలలోనే చేరాలి

Jun 7 2025 12:06 AM | Updated on Jun 7 2025 12:06 AM

ప్రభుత్వ కళాశాలలోనే చేరాలి

ప్రభుత్వ కళాశాలలోనే చేరాలి

సిరిసిల్లటౌన్‌: విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలోనే చేరాలని సిరిసిల్ల ఇంటర్మీడియట్‌ విద్యాధికారి శ్రీనివాస్‌ అన్నారు. ఇంటర్మీడియట్‌ అడ్మిషన్‌ డ్రైవ్‌ లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (కో ఎడ్యుకేషన్‌) కళాశాల అధ్యాపకులు వెంకంపేట ప్రాంతంలో ప్రచారం చేపట్టారు. ప్రిన్సి పాల్‌ విజయ రఘునందన్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపిక

చందుర్తి(వేములవాడ): మండలంలోని మల్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీదర్ల దీక్షిత జాతీయ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌కు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు శరత్‌చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు.

తంగళ్లపల్లి(సిరిసిల్ల): తాడూర్‌ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని కొత్వాల సహస్ర జాతీయ స్థాయి ఉపకార వేతనానికి ఎంపికైంది. నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు సహస్ర ఎంపికైనట్లు హెచ్‌ఎం బూర రవీందర్‌ శుక్రవారం తెలిపారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు. ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా నెలకు రూ.వెయ్యి చొప్పున ఇంటర్మీడియట్‌ పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం అందివ్వనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement