
‘ఇందిరమ్మ’తో సొంతింటి కల సాకారం
● మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇందిరమ్మ పథకంతో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలంలో 760 మంది లబ్ధిదారులకు మంగళవారం మంజూరుపత్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలోనే రేషన్కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ఝా, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శశికళ, తహసీల్దార్ ఎంఏ ఫారుక్, నాయకులు భాస్కర్రెడ్డి, ఐలయ్యయాదవ్, రమణారెడ్డి, పసుల వెంకటి తదితరులు పాల్గొన్నారు.
టీబీ బాధితులకు ఉచితంగా మందులు
● డీఎంహెచ్వో రజిత
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలోని టీబీ వ్యాధి బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తామన్నారు. మండలంలోని ఇందిరానగర్లో టీబీ ముక్త్ భారత్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో టీబీ మందులు వాడినవారు, డయాబెటీస్, బీడీ తాగేవారు, బీఎంఐ 18 కన్నా తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఎక్స్రే పరీక్షలు చేయాలని సూచించారు. అందుకోసం 102 ప్రభుత్వ వాహనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. టీబీ వ్యాధి వచ్చిన వారికి ప్రభుత్వం నుంచి ఉచితంగా మందులు, ఆరు నెలల వరకు పోషణ భత్యం, పోషకాహారం కోసం రూ.వెయ్యి అందిస్తామని తెలిపారు. టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిత, వైద్యులు అంజలి ఆల్ఫ్రెడ్, సంపత్, రామకృష్ణ, ఎంఎల్హెచ్పీ స్రవంతిరెడ్డి, డిప్యూటీ డెమో రాజ్కుమార్, లింగం, బిగిందర్, జేత్య పాల్గొన్నారు.

‘ఇందిరమ్మ’తో సొంతింటి కల సాకారం