
ఉగ్రదాడిపై ఆగ్రహజ్వాల
సిరిసిల్లటౌన్/వేములవాడ: కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో బుధవారం సిరిసిల్లలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, మహిళా నాయకులు పల్లం అన్నపూర్ణ, వైశాలి, కర్ని హరీష, శ్రీకాంత్ పాల్గొన్నారు. వేములవాడ రాజన్న గుడి ఎదుట బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, రేగుల మల్లికార్జున్, రాపెల్లి శ్రీధర్ తదితరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.