రోడ్డు దాటాలంటే భయమే.. | - | Sakshi
Sakshi News home page

రోడ్డు దాటాలంటే భయమే..

Apr 22 2025 12:07 AM | Updated on Apr 22 2025 12:07 AM

రోడ్డ

రోడ్డు దాటాలంటే భయమే..

వేములవాడఅర్బన్‌: కరీంనగర్‌–సిరిసిల్ల ప్రధాన రహదారి వాహనాలతో బిజీగా ఉంటుంది. ఈ రోడ్డును ఆనుకుని ఉన్న గ్రామాలకు చందిన వారు రోడ్డు క్రాస్‌ చేసేందుకు ప్రయత్నిస్తూ నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరి ప్రాణం పోతుందో తెలియక భయాందోళన చెందుతున్నారు. ప్రతీ నెల దాదాపు పదికి మించి ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఈ రోడ్డుపై పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మధ్యలోనే ఆగిన రోడ్డు

కరీంనగర్‌ నుంచి కామారెడ్డికి వెళ్లాలంటే ఈ రోడ్డు ప్రధానం. మధ్యలో నాంపల్లి స్టేజీ నుంచి కుడివైపు మళ్లితే వేములవాడకు వెళ్లవచ్చు. రాజన్న భక్తులకు సైతం ఇదే ప్రధాన రహదారి. నిత్యం తిరిగే వాహనాలతోపాటు రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలతో ఈ రోడ్డు బిజీగా మారుతోంది. కరీంనగర్‌ నుంచి కొదురుపాక వరకు ఫోర్‌లేన్‌ రోడ్డు వేశారు. సిరిసిల్ల నుంచి నందికమాన్‌ వరకూ ఫోర్‌లేన్‌ రహదారి పూర్తి చేశారు. నందికమాన్‌ నుంచి కొదురుపాక మిడ్‌మానేరు వంతెన వరకు దాదాపు 8 కిలోమీటర్ల దూరం మాత్రమే ఫోర్‌లేన్‌ రోడ్డు పూర్తి కాలేదు. ఈ 8 కిలోమీటర్ల మధ్యలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.

రోడ్డు దాటాలంటే భయమే..

వేములవాడ నందికమాన్‌ నుంచి ఆరెపల్లి వరకు కరీంనగర్‌–సిరిసిల్ల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కొడుముంజ, శాభాష్‌పల్లి, శాంతినగర్‌, నాంపల్లి, అనుపురం, రుద్రవరం, సంకెపల్లి, అరెపల్లి గ్రామాల ఇళ్లు రోడ్డును ఆనుకుని రెండు వైపులా ఉన్నాయి. నిత్యావసరాలు, ఇతరత్ర పనుల కోసం గ్రామస్తులు ఇటు నుంచి అటు వైపు వెళ్లాలంటే రోడ్డు దాటాల్సిందే. అయితే ఈక్రమంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.

రోజుకో ప్రమాదం.. పోతున్న ప్రాణం

పూర్తికాని ఫోన్‌లేన్‌ రోడ్డు

నాంపల్లిగుట్ట నుంచి కొదురుపాక వరకు ప్రమాదకరం

తరచూ రోడ్డు ప్రమాదాలు

గత 15 రోజుల క్రితం అనుపురం గ్రామానికి చెందిన వంశీ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌ ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు.

అనుపురం గ్రామానికి చెందిన రాజయ్య బైక్‌పై వెళ్తుండగా మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

రాజన్న దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో అనుపురం వద్ద ఖాజీపూర్‌కు చెందిన కుటుంబం వెంకటేశ్‌, రజిత, అభిరామ్‌లను కారు ఢీకొట్టడంతో గాయపడ్డారు.

ఐదు రోజుల కిత్రం అనుపురం గ్రామానికి చెందిన బండారి శ్రీహరిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

గతంలో ఆరెపల్లి శివారులో ఇద్దరు, నాంపల్లి శివారులో ఒక్కరు, అనుపురం శివారులో ఇద్దరు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.

రోడ్డు దాటాలంటే భయమే..1
1/1

రోడ్డు దాటాలంటే భయమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement