
పర్యావరణ పరిరక్షణ దినోత్సవ ప్రతిజ్ఞ
లక్ష్మీపురం: పర్యావరణ పరిరక్షణను ప్రొత్సహించే లక్ష్యంతో గుంటూరు రైల్వే స్టేషన్లో వేడుకలు నిర్వహించామని డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఒకటో ప్లాట్ఫాంపై ప్రయాణికులకు అవగాహన కలిగించారు. ర్యాలీ చేపట్టి, నాటకం ప్రదర్శించారు. డివిజన్ అధికారులు, ప్రయాణికులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్ఎం మాట్లాడుతూ పర్యావరణ అనుకూల అలవాట్లను నేర్చుకోవాలన్నారు. అనంతరం నల్లపాడులోని మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం కె.సైమన్, సీనియర్ డీఈఎన్ జె.వి. అనూష, సీనియర్ డీఎంఈ ఎం.రవికిరణ్, సీనియన్ డీసీఎం డాక్టర్ సీహెచ్ ప్రదీప్, డీఎస్సీ మధుసూదన రావు, సీనియర్ డీఈఈ జి.సూర్యనారాయణ, పి.రవితేజ తదితరులు పాల్గొన్నారు.
లాంఫాంలో వన మహోత్సవం
గుంటూరు రూరల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధంపై గురువారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఆర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, శాస్త్రవేత్తలు పరిశోధన స్థానంలో మొక్కలు నాటారు. ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్న తరుణంలో విత్తనం ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయా ప్రాంతాలకు అనువైన విత్తనాలను లైసెన్స్డ్ డీలర్ల వద్ద , లేదా వ్యవసాయ శాఖ, లేదా యూనివర్సిటీ వద్ద మాత్రమే పొందాలన్నారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు పరిశీలనలో ఉన్న కంది రకం ఎల్ఆర్జీ 494 ను అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ దినోత్సవ ప్రతిజ్ఞ