
కేడీసీసీబీని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణాజిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ (కేడీసీసీ) బ్యాంక్ను మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్(చిన్ని) ఆకాంక్షించారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నియమితులైన నెట్టెం రఘురామ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన కేశినేని శివనాధ్ మాట్లాడుతూ బ్యాంక్ చైర్మన్ పదవి ఆయనకు అలంకారం మాత్రమేనని, ఎందుకంటే గతంలోనే ఎన్నో పదవులు నిర్వర్తించి వివాద రహిత వ్యక్తిగా నిలిచారని అన్నారు. తన సుదీర్ఘ అనుభవంతో బ్యాంక్ను మరింత వృద్ధిలోకి తీసుకువస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్రావు, శ్రీరాం రాజగోపాల్, కొలికపూడి శ్రీనివాసరావు, నాగుల్మీరా తదితరులు పాల్గొని నెట్టెం రఘురామ్ను అభినందించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘరామ్ మాట్లాడతూ బ్యాంక్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్