
మహోన్నతమైన వ్యక్తి అంబేడ్కర్..
మక్తల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని గుడిగండ్లలో అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని బౌద్దబిక్షువులతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయలను భవిష్యత్ తరాలకు అందించడం మనందరి బాధ్యత అని, ప్రపంచ మేధావి చూపిన మార్గంలో ముందుకు సాగుతూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ఒక వర్గానికి చెందిన వాడు కాదని ఆయన అందరివాడని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, విశ్రాంత ఎంఈఓ లక్ష్మినారాయణ, నాయకులు నర్సింహగౌడ్, రాజుల ఆశిరెడ్డి, శ్రీనివాసుగుప్తా, హనుమంతు టీచర్, మాజీ సర్పంచ్ మహేశ్వరి, మాజీ ఎంపీటీసీ లక్ష్మి నర్సిరెడ్డి, గణేష్కూమార్ పాల్గొన్నారు.