రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Published Tue, Mar 26 2024 1:05 AM

చింతకాయల 
వెంకన్న (ఫైల్‌) - Sakshi

హుజూర్‌నగర్‌: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హుజూర్‌నగర్‌లో సోమవారం జరిగింది. ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన రిక్షా కార్మికుడు చింతకాయల వెంకన్న (55) సోమవారం మధ్యాహ్నం ఇందిరా చౌరస్తా నుంచి సుందరయ్యనగర్‌ కాలనీకి నడుచుకుంటు వెళ్తున్నాడు. మార్గమధ్యలో పీఎస్‌ఆర్‌ సెంటర్‌ వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న క్రేన్‌ను డ్రైవర్‌ చేకూరి రాజేష్‌ అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి వెంకన్నను ఢీకొట్టాడు. దీంతో వెంకన్న కిందపడిపోగా కడుపులో బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రాంతీయ వైద్యశాలలో తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి బావమరిది ములకలపల్లి రాంగోిపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement