వనదేవతలను దర్శించుకున్న ఈఓ వీరస్వామి | - | Sakshi
Sakshi News home page

వనదేవతలను దర్శించుకున్న ఈఓ వీరస్వామి

Jun 3 2025 5:39 AM | Updated on Jun 3 2025 5:39 AM

వనదేవతలను దర్శించుకున్న ఈఓ వీరస్వామి

వనదేవతలను దర్శించుకున్న ఈఓ వీరస్వామి

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను అదనపు కార్యనిర్వహణాధికారి మేకల వీరస్వామి సోమవారం దర్శించుకున్నారు. మేడారం ఈఓగా బాధ్యతలను స్వీకరించిన ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. మేడారం వచ్చిన నూతన ఈఓ వీరస్వామిని సిబ్బంది మార్యాదపూర్వకంగా కలిశారు. పూజారులు దగ్గరుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ వీరస్వామిని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించారు. ఆయన వెంట సూపరింటెండెంటెండ్‌ క్రాంతికుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ రాజేశ్వర్‌రావు, మధు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement