అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి

May 3 2025 8:20 AM | Updated on May 3 2025 8:20 AM

అర్హు

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి

ములుగు: ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంభందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌మిట్టిల్‌తో కలిసి భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరాఖాస్తులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా జిల్లా తరఫున కలెక్టర్‌ దివాకర టీఎస్‌, అదనపు కలెక్టర్లు సీహెచ్‌ మహేందర్‌జీ, సంపత్‌రావులు పాల్గొన్నారు. అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్‌, అధికారులు పాల్గొన్నారు.

ఈదురుగాలులతో రూ.55లక్షల నష్టం

వెంకటాపురం(ఎం): ఆకాలవర్షంతో పాటు ఈదురుగాలులకు రూ.55 లక్షల నష్టం వాటిల్లిందని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వెల్తుర్లపల్లిలో ఈదురుగాలులతో విరిగిన విద్యుత్‌ స్తంభాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెల్తుర్లపల్లితో పాటు రేగొండ, గణపురం ప్రాంతాల్లో ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. భూపాలపల్లి సర్కిల్‌ పరిధిలో 351 స్తంభాలు నేలకొరిగాయన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్‌ సిబ్బంది అహర్నిశలు శ్రమించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారన్నారు. ఈ కార్యక్రమంలో సీఈ రాజచౌహాన్‌, భూపాలపల్లి సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మల్చూర్‌నాయక్‌, జీఎం సురేందర్‌, ములుగు డీఈ నాగేశ్వర్‌రావు, డీఈలు పాపిరెడ్డి, సదా నందం తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో

వెంకటాపురం(ఎం): ఆకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మండలంలోని పాపయ్యపల్లి రహదారిపై నర్సాపూర్‌, సింగరకుంటపల్లి, పాపయ్యపల్లి గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతోనే తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డి మాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న వెంకటాపురం ఎస్సై జక్కుల సతీష్‌ రాస్తారోకో వ ద్దకు చేరుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ కా ర్యక్రమంలో మూడు గ్రామాలకు చెందిన సు మారు 200మంది రైతులు పాల్గొన్నారు.

15వరకు టెన్త్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు

భూపాలపల్లి అర్బన్‌: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతోపాటు, రీ వెరిఫికేషన్‌ కోరుకునే విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి రాజేందర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి1
1/2

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి2
2/2

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement