భూ భారతితో సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో సమస్యలు పరిష్కారం

Jun 5 2025 7:38 AM | Updated on Jun 5 2025 7:38 AM

భూ భారతితో సమస్యలు పరిష్కారం

భూ భారతితో సమస్యలు పరిష్కారం

అదనపు కలెక్టర్‌

నగేష్‌

వెల్దుర్తి(తూప్రాన్‌)/చేగుంట: అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిందని అదనపు కలెక్టర్‌ నగేష్‌ అన్నారు. ఈ మేరకు మాసాయిపేట మండలం రామంతాపూర్‌ పంచాయతీ పరిధి లింగారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం చేగుంట మండలంలోని వల్లభాపూర్‌లో పర్యటించారు. ప్రభుత్వ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన దరఖాస్తులను గ్రామస్తులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు అమ్మడం, కొనడం నిషేధం అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీకాంత్‌, డిప్యూటీ తహసీల్దార్‌ స్వప్న, ప్రత్యేక అధికారి భూమేష్‌ రైతులు పాలొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement