
అసంఘటిత కార్మికులు బీమా పొందాలి
నర్సాపూర్ : అసంఘటిత కార్మికులు ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో లభించే బీమాను పొందాలని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎం.హేమలత అన్నారు. మంగళవారం స్థానిక కోర్టులో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద వారు న్యాయ సహాయం అవసరమైతే మండల లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా సహాయం పొందవచ్చని సూచించారు. లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో భూ సమస్యను పరిష్కరించిన అనంతరం తాజాగా రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాన్ని రైతు అశోక్కు ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ సివిల్ జడ్జి ఎం.హేమలత