కార్యకర్తలను కాపాడుకుంటా | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలను కాపాడుకుంటా

Apr 30 2025 7:13 AM | Updated on Apr 30 2025 7:13 AM

కార్య

కార్యకర్తలను కాపాడుకుంటా

పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి
అదనపు కలెక్టర్‌కు ఈజీఎస్‌ ఉద్యోగుల వినతి
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌

మెదక్‌జోన్‌ : పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికలసమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడుపాయలు, చర్చి అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయి కుమార్‌ మాట్లాడుతూ పార్టీకోసం పని చేసిన వారిని అధిష్టానం గుర్తిస్తుందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, పార్టీ నేతలు రాజిరెడ్డి, సుహాసిని రెడ్డి, చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి, సుప్రభాత రావు, రామచందర్‌ గౌడ్‌, చంద్ర పాల్‌, హఫీజ్‌ పాల్గొన్నారు. అంతకు ముందు కశ్మీర్‌ ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

మెదక్‌ కలెక్టరేట్‌: మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్‌ అమలు చేయాలని ఈజీఎస్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఈజీఎస్‌ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్‌ రాజ్‌ కుమార్‌, ఏపీఓలు మహిపాల్‌ రెడ్డి, శ్యామ్‌ కుమార్‌, శంకర్‌, పౌల్‌, ఈసీలు భగవాన్‌ రెడ్డి వేణు, రాజేశ్వర్‌, సీఓల సంఘం రాష్ట్ర నాయకులు రాము, జేఏసీ ప్రతినిధులు శశిరేఖ, స్వప్న, బాలరాజ్‌, అనిల్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో రోడ్డు భద్రత, మే4న జరగనున్న నీట్‌ పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష, ఉల్లాస్‌ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. నేషనల్‌ హైవేలపై బ్లాక్‌ స్పాట్ల వద్ద రేడియం స్టిక్కర్లతో కూడిన సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. నీట్‌ పరీక్షకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాల న్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఉల్లాస్‌ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సూచించారు.తూప్రాన్‌, మనోహరాబాద్‌, నర్సాపూర్‌, శివంపేట మండలాల్లోని చెరువుల సర్వేను వేగవంతం చేయా లని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. కాగా ఎకై ్సజ్‌ శాఖ నిర్వహించిన లాటరీలో మెదక్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను హైదరాబాద్‌కు చెందిన శోభ దక్కించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ సమావేశాల్లో ఆర్‌అండ్‌బి సర్దార్‌ సింగ్‌, డీఎస్పీ ప్రసన్న కుమార్‌, పోలీసులు, ఆర్డీవో రమాదేవి, యూజీసీ–నీట్‌ సిటీ కోఆర్డినేటర్‌, నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కే హుస్సేన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్‌, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కార్యకర్తలను కాపాడుకుంటా 1
1/1

కార్యకర్తలను కాపాడుకుంటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement