
వనదుర్గమ్మ ఆదాయం రూ.46 లక్షలు
పాపన్న పేట (మెదక్): ఏడుపాయల వన దుర్గాభవాని దేవి ఆలయ హుండీ ఆదాయం రూ.46లక్షల 8354 వచ్చినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ చంద్రశేఖర్ వెల్లడించారు. సోమవారం 58 రోజుల అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమం రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో గోకుల్ షేడ్లో నిర్వహించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రత్యేక అధికారి అసిస్టెంట్ కమిషనర్ సులోచన పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ చేపట్టగా బంగారు, వెండి వస్తువులతో పాటు నగదు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్యశ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, శ్యామ్, శ్రీనివాస్ శర్మ, రాజు, రవి, యాదగిరి పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.