
పరిహారం అందించేందుకే సర్వే..
శివ్వంపేట(నర్సాపూర్): ట్రిబుల్ ఆర్ కోసం కేటాయించిన భూముల్లో అధికారులు సర్వే చేశారు. మండలంలోని లింగోజిగూడ, కొత్తపేట, రత్నపూర్, పాంబండ, పోతులబోగూడ, కొంతన్పల్లి గ్రామాల్లో ట్రిబుల్ ఆర్ లో రైతులు భూములు కోల్పోతున్నారు. ఆర్ఐ కిషన్, సర్వేయర్ అరుణ్కుమార్, పంచాయతీ రాజ్ సిబ్బంది మంగళవారం లింగోజిగూడ గ్రామంలో సర్వే చేపట్టారు. ట్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో రైతులకు సంబంధించి బోరుబావులు, పైపులైన్, చెట్ల వివరాలు నమోదు చేశారు. భూములతో పాటు ఇతర కట్టడాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతులకు పరిహారం అందిస్తామని, అందుకు గాను ఆ భూముల్లో సర్వే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.