వ్యాపారంలో రాణించాలి | Sakshi
Sakshi News home page

వ్యాపారంలో రాణించాలి

Published Mon, Mar 25 2024 12:30 AM

-

మెదక్‌: మెలకువలు పాటిస్తూ వ్యాపార, పారిశ్రామిక రంగంలో రాణించాలని అదనపు కలెక్టర్‌ రమేష్‌ పేర్కొన్నారు. శనివారం మెదక్‌ చర్చి ఆవరణలో చిన్న, మధ్య తరహా వ్యాపార వర్గాలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. చిన్న వ్యాపారులకు ఎగుమతి, దిగుమతులకు సంబంధించి వివిధ ప్రక్రియలు, లైసెన్సింగ్‌ విధానం, భారత ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సహాయాలు, డీజీఎఫ్‌టీ తదితర విషయాలపై అవగాహన కల్పించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల విభాగం జనరల్‌ మేనేజర్‌ కృష్ణమూర్తి, యువజన క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు, మత్స్యశాఖ అధికారి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement