2,308 ఎకరాల్లో పంట నష్టం | Sakshi
Sakshi News home page

2,308 ఎకరాల్లో పంట నష్టం

Published Wed, May 8 2024 11:50 PM

2,308 ఎకరాల్లో పంట నష్టం

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి దిగుబడి దశలో ఉన్న పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు బుధవారం ప్రాథమిక సర్వేలో గుర్తించారు. 10 మండలాల్లోని 70 గ్రామాల్లో 1,563 మంది రైతులకు చెందిన 2,308 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. పంట నష్టాన్ని అంచనా వేసి వ్యవసాయ కమిషనరేట్‌కు నివేదిక పంపిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ తెలిపారు.

మండలం గ్రామాలు ఎకరాలు రైతులు

దండేపల్లి 2 17 9

చెన్నూర్‌ 19 1060 729

జైపూర్‌ 7 537 366

భీమారం 7 90 50

కోటపల్లి 2 32 25

బెల్లంపల్లి 2 38 38

తాండూర్‌ 8 139 88

భీమిని 6 120 38

కన్నెపల్లి 10 95 90

వేమనపల్లి 7 180 130

Advertisement
Advertisement