
మావోల మృతదేహాలను బంధువులకు అప్పగించాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన నంబాల కేశవరావు సహా మావోయిస్టుల మృతదేహాలను బంధువులకు అప్పగించాలని వామపక్ష ప్రజా హక్కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శత్రుదేశాల సైనికులు యుద్ధంలో మరణిస్తే మృతదేహాలను వారిబంధువులకు అప్పగిస్తుండగా, మావోయిస్టుల విషయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. మావో లను సజీవంగా పట్టుకుని కాల్చి చంపినందుకే తాత్సారం చేస్తున్నారని తెలిపారు. కా గా, ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శాంతి సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్ ఎంఎఫ్.గోపీనాథ్, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు బాగం హేమంతరావు, నున్నా నాగేశ్వరరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, దండి సురేష్, లక్ష్మీనారాయణ, కాకి భాస్కర్, ఐ.వీ.రమణారావు, రవిమారుత్, విజయ్, చిర్రా రవి, జానీమియా, ఎర్ర బాబు, గోవిందరావు, మాదినేని రమేష్, వై.విక్రమ్, జాన్సీ, ఖాసిం పాల్గొన్నారు.