
మెడికల్ కళాశాలకు పార్థివదేహం అందజేత
సుల్తానాబాద్(పెద్దపల్లి): మండల కేంద్రానికి చెందినపెగడ లక్ష్మీనారాయణ శుక్రవారం రాత్రి అనారో గ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఆశ యం మేరకు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క రీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీకి లక్ష్మీనారాయణ పార్థివదేహాన్ని శనివారం దానంచేశారు. ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మేరుగు భీష్మాచారి సహకారంతో మృదేహాన్ని కాలేజీకి అప్పగించారు. పార్థిదేహాన్ని దానం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు పెగడ రాజమౌళి, రమేశ్, అయిలయ్య, పరుశరాములు, చందు, శ్రీనివాస్, ఆంజనేయులు, కిషన్, సూర్యానికి ప్రతిమ మెడికల్ కాలేజీ అనాటమీ హెడ్, వైస్ ప్రిన్సిపాల్ కిషన్రెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు, ముత్యాల నర్సయ్య అభినందించారు.