
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథులు
ఐదేళ్ల పాటు ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య వారథులుగా మేం ఎన్నో రకాల సేవలందించాం. గౌరవ వేతనంతో సంబంధం లేకుండా ప్రజలకు నిష్పక్షపాతంగా సాయం అందించడం చాలా సంతృప్తినిచ్చింది. స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలన్న తపనతో కోవిడ్ సమయంలో ఎంతో చేశాం. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లళ్లో ఉండిపోతే మేమే వెళ్లి వారికి నిత్యావసర వస్తువులు, మందులు, కిరాణా సరకులు అందించాం. అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైన రోగులకు ఆస్పత్రికి వెళ్లి మరీ పింఛన్లు అందించే వాళ్లం. వరదల సమయంలో ప్రతి ఇంటికీ పీకల్లోతు నీటిలో వెళ్లి ప్రజలకు నిత్యావసర సరకులు, మంచినీరు అందించాం. దురుద్దేశంతోనే వలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అప్పుడు మేం చేసిన సేవలను ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారు. చాలా సంతోషం.
– వలీ బాబా, వలంటీర్, పిఠాపురం