
వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి
మల్దకల్: రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఏడీఎ సంగీతలక్ష్మి అన్నారు. శుక్రవారం మల్దకల్ రైతు వేదికలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ వీసీ ద్వారా రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు నేరుగా రైతులతో మాట్లాడారు. ఆధార్తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకి 11 నెంబర్లలో విశిష్ట సంఖ్యని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పంటల సాగు విధానంపై రైతులకు అవగహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓలు రాజశేఖర్, శ్రీలత, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.