
ఏళ్లుగా.. అచేతనంగా!
చేనేత పార్కు ఏర్పాటుపై ముందడుగు పడని వైనం
●
పార్కు ఏర్పాటు చేయాలి
చేనేత పార్కును త్వరగా ఏర్పాటు చేయాలి. దీనిద్వారా ప్రతేక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా పార్కుకు కేటాయించిన స్థలంలో కొందరు మట్టిని అక్రమంగా తరలిస్తూ స్థలాన్ని నాశనం చేస్తున్నారు. స్థలాన్ని కాపాడి రక్షణ చర్యలు చేపట్టాలి.
– రాంలింగేశ్వర్కామ్లీ,
గద్వాల చేనేత క్లస్టర్ చైర్మన్
నివేదిక పంపించాం
పార్కుకు కేటాయించిన స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం రూ.2.40కోట్లతో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ఇంజినీరింగ్ అధికారుల ద్వారా చేపడుతాం. అదేవిధంగా రూ.50లక్షలలో రూ.8.50లక్షలు ఏపీఐసీసీ వాళ్లు దిమ్మెల ఏర్పాటు, సెక్యూరిటీ గార్డు ఏర్పాటుకు వెచ్చించారు. రెవెన్యూ శాఖ వారు ఫొటోగ్రఫి సర్వే చేయగా ఇందుకు రూ.2.50లక్షలు ఖర్చు చేశారు. ఈనిధులను రాష్ట్ర ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు ఖర్చు చేయడం జరిగింది. మట్టిదందాపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశాం. కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తే పూర్తిస్థాయిలో రక్షణ కల్పించవచ్చు.
– గోవిందప్ప, ఏడీ చేనేత శాఖగద్వాల
● నిధులున్నా పట్టించుకోని అధికారులు
● రూ.11లక్షలు ఖర్చు చేసినట్లు
అధికారుల కాకిలెక్కలు
● మట్టి మాఫియాకు కాసుల వర్షం
కురిపిస్తున్న పార్కుకు కేటాయించిన స్థలం