బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి

May 1 2025 1:27 AM | Updated on May 1 2025 1:27 AM

బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి

బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి

శాంతినగర్‌: పోలీస్‌ స్టేషన్‌కు వివిధ సమస్యల గురించి వచ్చే బాధితులకు సత్వరం న్యాయం అందేలా ఆయా స్టేషన్ల సిబ్బంది చూడాలని ఎస్పీ టి.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కార్యాలయంలోని వివిధ రికార్డులను, స్టేషన్‌ పరిసరాలను, సిబ్బంది నిర్వహిస్తున్న విధులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. 100 నంబర్‌కు కాల్‌ వస్తే వెంటనే స్పందించి అక్కడికి చేరుకోవాలని.. బాధితులకు రక్షణ కల్పించాలన్నారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు విసృతంగా నిర్వహించి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని, 24/7 గస్తీ నిర్వహించాలన్నారు. తరచూ గ్రామాలను సందర్శించి సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు, మూడనమ్మకా లు, బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో వుంటూ ప్రజా సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. డీఎస్పీ వై.మొగులయ్య, సీఐ టాటా బాబు, ఎస్‌ఐ నాగశేఖర్‌ రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement