ముక్తీశ్వరుడి ఆదాయం రూ.22.78లక్షలు | Sakshi
Sakshi News home page

ముక్తీశ్వరుడి ఆదాయం రూ.22.78లక్షలు

Published Wed, Mar 27 2024 1:15 AM

నగదు లెక్కిస్తున్న సేవాసమితి సభ్యులు  - Sakshi

కాళేశ్వరం: కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం హుండీలను మంగళవారం లెక్కించినట్లు ఈఓ మహేష్‌ తెలిపారు. దేవాదాయశాఖ రెవెన్యూ పరిశీలకుడు టి.సాయిబాబ సమక్షంలో హుండీలను లెక్కించగా రూ. 22,78,554 ఆదాయం సమకూరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, యూనియన్‌ బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎస్‌. ప్రసాద్‌, కామారెడ్డికి చెందిన శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు 75 మంది, రాగినేడుకు చెందిన శ్రీ ముక్తీశ్వర సేవా సమితి సభ్యులు 13 మంది, హైదరాబాద్‌కు చెందిన శ్రీ భ్రమరాంబిక సేవా సమితి సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement