
‘వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం’ పుస్తకావిష్కరణ
కపిలేశ్వరపురం (మండపేట): ‘వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం’ అనే పుస్తకాన్ని జమాత్–ఎ–ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ రఫీఖ్ ఆవిష్కరించారు. మండపేట పట్టణం గాంధీనగర్ అల్–ఆమీన్ మస్జిద్లో మంగళవారం జమాత్–ఎ–ఇస్లామీ హింద్ మండపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక సమావేశంలో రక్షీఖ్ పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు జరుపుకునే బక్రీద్ పండగ పాడిరైతులకు ఆర్థిక చేయూతనిస్తుందన్నారు. వక్ఫ్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని, మేధావులు, ధార్మిక సంస్థలు, ప్రజాసంఘాలు శాసీ్త్రయ దృక్పథంతో వక్ఫ్ చట్టాన్ని సమీక్షించాలని కోరారు. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం’ పేరుతో ప్రచురితమైన పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో జమాత్–ఎ–ఇస్లామీ హింద్ స్థానిక కమిటీ అధ్యక్షుడు ఫారుఖ్ అలీ, జిల్లా అధ్యక్షుడు అబుల్ ఆలా, అల్– ఆమీన్ మస్జిద్ అధ్యక్షుడు రహీం, జమియా మస్జిద్ అధ్యక్షుడు అల్తాఫ్, ముస్లిం జేఏసీ నాయకులు ఎండీ కరీం, సయ్యద్ ఇబ్రాహీం షరీఫ్, షేక్ ఇబ్రాహీం, కరీం పాల్గొన్నారు.