
తిరుమల విద్యార్థుల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో రాజమహేంద్రవరంలోని తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్టు విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు కె.ప్రణీత్ రెండో ర్యాంకు, కె.యశ్వంత్ సాత్విక్ ఎనిమిది, ఇ.వర్షిత్ 12, ఎం.సుమంత్దొర 38, కె.అభినవ్ 42, జి.సుజోష్రాజ 43, జి.అఖిల్సాయి 45, తుమాటిపూజిత అఖిల్రాజ్కుమార్ 85, కప్పల వెంకటరామవినీష్ 127, పాతపాటి వెంకటవివేక్వర్మ 132, మువ్వల లిఖిత 137 ర్యాంకులు సాధించారని వివరించారు. ఇంకా 165, 174, 193, 195, 231, 238, 246, 270, 275, 276 ర్యాంకులు సాధించారన్నారు. వెయ్యిలోపు 69, మూడు వేలలోపు 201, ఐదు వేలలోపు 333, పది వేలలోపు 456 మంది ర్యాంకులు సాధించారని చెప్పారు. 260 మంది పైన విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించగలరని తెలిపారు. ర్యాంకర్లను తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు.