
వాడపల్లి వెంకన్న ఆభరణాల తనిఖీ
బంగారం,
వెండి
వస్తువుల రికార్డులు
పరిశీలిస్తున్న అధికారులు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి దాతలు సమర్పించిన బంగారం, వెండి వస్తువులను బుధవారం అధికారులు తనిఖీ చేశారు. దాతలు సమర్పించిన బంగారం, వెండి వస్తువులను ప్రతి మూడేళ్లకు ఒకసారి దేవదాయ – ధర్మాదాయశాఖ జ్యుయలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ (జేవీఓ) తనిఖీ చేస్తారు. ఆ మేరకు జేవీఓ వి.పళ్లంరాజు, డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బందితో కలిసి తనిఖీ జరిపారు. రికార్డుల ప్రకారం బంగారం వస్తువులు 163 (7.421 కేజీలు), వెండి వస్తువులు 303 (183.339 కేజీలు) ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.