వాడపల్లి వెంకన్న ఆభరణాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

వాడపల్లి వెంకన్న ఆభరణాల తనిఖీ

May 22 2025 12:15 AM | Updated on May 22 2025 12:15 AM

వాడపల్లి వెంకన్న ఆభరణాల తనిఖీ

వాడపల్లి వెంకన్న ఆభరణాల తనిఖీ

బంగారం,

వెండి

వస్తువుల రికార్డులు

పరిశీలిస్తున్న అధికారులు

కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి దాతలు సమర్పించిన బంగారం, వెండి వస్తువులను బుధవారం అధికారులు తనిఖీ చేశారు. దాతలు సమర్పించిన బంగారం, వెండి వస్తువులను ప్రతి మూడేళ్లకు ఒకసారి దేవదాయ – ధర్మాదాయశాఖ జ్యుయలరీ వెరిఫికేషన్‌ ఆఫీసర్‌ (జేవీఓ) తనిఖీ చేస్తారు. ఆ మేరకు జేవీఓ వి.పళ్లంరాజు, డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బందితో కలిసి తనిఖీ జరిపారు. రికార్డుల ప్రకారం బంగారం వస్తువులు 163 (7.421 కేజీలు), వెండి వస్తువులు 303 (183.339 కేజీలు) ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement