‘ఆరణి’ని మార్చాల్సిందే..! | Sakshi
Sakshi News home page

‘ఆరణి’ని మార్చాల్సిందే..!

Published Thu, Mar 28 2024 2:00 AM

-

తిరుపతి(అలిపిరి): ఎక్కడ నుంచో వచ్చిన వారికి తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థిగా కేటాయించడం తిరుపతిలోని నాయకులకే కాదు.. ప్రజల మనోభావాలను దెబ్బతీశారని.. ఉమ్మడి అభ్యర్థిగా కేటాయించిన ఆరణి శ్రీనివాసులును తాను శత్రువుగానే పరిగణిస్తానని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. బుధవారం తన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను సోదరిగా భావించానన్న ఆరణి శ్రీనివాసులు తన కుటుంబానికి ఎంతో అన్యాయం చేశారని.. తనకు చెందిన భూములను ఇతరులకు పంచాలని పోరాటం చేశారని.. మళ్లీ ఆరు నెలల క్రితం మహిళ అని చూడకుండా తనను బెదిరించారని.. కేసు వేశారన్నారు.

తనను దోషిగా.. నిందితురాలిగా చూపించి ప్రస్తుతం తిరుపతిలో అభ్యర్థిగా వచ్చి గెలిపించాలంటే సాధ్యమా.. ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికై నా పార్టీ అధినేతలు పునరాలోచించి తిరుపతికి మంచి అభ్యర్థిని కేటాయించాలని కోరారు.

Advertisement
Advertisement