బర్లీపై బేఖాతర్‌ ! | - | Sakshi
Sakshi News home page

బర్లీపై బేఖాతర్‌ !

Jun 6 2025 6:03 AM | Updated on Jun 6 2025 6:03 AM

బర్లీపై బేఖాతర్‌ !

బర్లీపై బేఖాతర్‌ !

సాక్షి ప్రతినిధి, బాపట్ల: రైతుల వద్ద ఉన్న బ్లాక్‌ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని మే నెల 24న పర్చూరు ప్రాంతంలో పర్యటించిన మంత్రుల బృందం ఆదేశించినా టుబాకో కంపెనీలు ఐ డోంట్‌కేర్‌ అంటున్నాయి. పొగాకు కొనాలని 22 కంపెనీలను ఆదేశిస్తే ఒకటి రెండు కంపెనీలు మినహా మిగిలినవి మొక్కుబడిగా కూడా కొనడం లేదు. కొన్ని కేవలం 10 టన్నులు కొని చేతులు దులుపుకున్నాయి. ప్రభుత్వం ఆదేశించి రెండు వారాలు దాటుతున్నా గురువారం నాటికి కేవలం 24,571 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశాయి. ఒక్క జీపీఐ లిమిటెడ్‌ కంపెనీ 3,426 మెట్రిక్‌ టన్నులు, ప్రధాన కంపెనీగా ఉన్న ఐటీసీ కేవలం 758 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. యార్లగడ్డ ఆగ్రోస్‌ 771 టన్నులు, కార్‌టెల్‌ 1933, అలి ఎంటర్‌ ప్రైజెస్‌ 766, మహమ్మద్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ 918, కళ్యాణీ టుబాకో 525, ఎస్‌బి ఇంపెక్స్‌ 460 టన్నుల చొప్పున కొనుగోలు చేయగా ఇక వేహా 12 టన్నులు, ప్రేవైల్‌ 46, ట్రేడ్‌ వెల్‌ 16, మహంకాళీ 10, ఎలైట్‌ ఆగ్రో 50 టన్నుల చొప్పున మాత్రమే కొనుగోలు చేసి మమ అనిపించాయి.

వంద మెట్రిక్‌ టన్నుల లోపే...

కొన్ని కంపెనీలు వంద మెట్రిక్‌ టన్నుల లోపే బ్లాక్‌బర్లీ కొనుగోలు చేశాయి. మొత్తంగా 22 కంపెనీలు కలిపి కేవలం 24, 571 మెట్రిక్‌ టన్నులు కొనగా ఒక్క జీపీఐ 3,500 టన్నులు కొంది. జీపీఐ నిత్యం రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేస్తోంది. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం రైతుల వద్ద 87.23 మెట్రిక్‌ టన్నుల పొగాకు దిగుబడి ఉండగా గురువారం నాటికి 24.57 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు.

పట్టించుకోని సర్కార్‌

జిల్లాలో రైతుల వద్ద ఉన్న బ్లాక్‌బర్లీ పొగాకు మొత్తం కొనుగోలు చేయిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత కొనుగోళ్లను ఏమాత్రం పర్యవేక్షించక చేతులెత్తేసింది. దీంతో కొనుగోళ్లు దాదాపు నిలిచిపోయాయి. మే 24న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లతో కూడిన మంత్రుల కమిటీ పర్చూరు నియోజకవర్గంలో పర్యటించి రైతుల వద్ద పొగాకు కొనాలని కంపెనీలను ఆదేశించాయి. మొత్తం పొగాకు కొనిపిస్తామని మాటిచ్చారు. ప్రధానంగా ఐటీసీ లాంటి పెద్ద కంపెనీలు కేవలం 758 మెట్రిక్‌ టన్నులు కొని చేతులు దులుపుకోవడం విమర్శలకు దారితీసింది. పొగాకు కొనిపించే విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదనడానికి ఇదే నిదర్శనమని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతోపాటు రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కొన్నా 20 వేల మెట్రిక్‌ టన్నులకు మించి కొనుగోలు చేసే పరిస్థితి ఉండక పోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు నియోజకవర్గంలోని పచ్చపార్టీ కార్యకర్తల పొగాకు మాత్రమే కొని చేతులు దులుపు కునే అవకాశముందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సర్కార్‌ ఆదేశాలు లెక్క చేయని టుబాకో కంపెనీలు రైతుల వద్ద బ్లాక్‌ బర్లీ కొనాలన్న ప్రభుత్వం జీపీఐ మినహా పొగాకు కొనని ఇతర కంపెనీలు మొక్కుబడి కొనుగోళ్లతో సరిపెట్టిన ఐటీసీ పేరుకు 22 కంపెనీలు ఉన్నా 25 వేల టన్నులు కూడా కొనని వైనం ఇంకా రైతుల వద్ద 62 వేల టన్నుల బ్లాక్‌ బర్లీ పొగాకు నిల్వలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement