నైపుణ్యాభివృద్ధి తరగతులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధి తరగతులు ప్రారంభం

May 28 2025 11:43 AM | Updated on May 28 2025 11:43 AM

నైపుణ్యాభివృద్ధి తరగతులు ప్రారంభం

నైపుణ్యాభివృద్ధి తరగతులు ప్రారంభం

తాడికొండ: మహిళలు, యువతకు నైపుణ్యాభివృద్ధి, సెన్సిటైజేషనుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల ద్వారా సాధికారత సాధించవచ్చని ఏపీ సీఆర్డీఏ నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలిపారు. అమరావతి ప్రాంతంలో మహిళలకు సాధికారత కల్పించడం, యువతకు నైపుణ్యాలను అందించేందుకు తుళ్ళూరులో ఈ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. నిర్మాణ స్థలాల వద్ద కార్మికుల రాకను దృష్టిలో ఉంచుకొని జెండర్‌ కమిటీల సభ్యులైన 368 స్వయం సహాయక బృంద మహిళలకు లింగ ఆధారిత హింసపై సెన్సిటైజేషన్‌ శిక్షణ ఇస్తున్నారు. వీరు సంబంధిత ఫిర్యాదులపై పని చేస్తారని అధికారులు తెలిపారు. ఏపీ సీఆర్డీఏ స్కిల్‌ హబ్‌ తుళ్ళూరులో పెయింటింగ్‌ కోర్సులో 22 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సు 30 మంది, ఫ్రంట్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో 29 మందికి శిక్షణ ప్రారంభమైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement