
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశం
పిల్లలను సురక్షితంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులదే
చీరాల అర్బన్: ఆర్టీసీ డిపో పరిధిలోని చీరాల, పర్చూరు, ఇంకొల్లు, వేటపాలెం బస్స్టేషన్లలో ఓపెన్ ప్రదేశాల్లో 15 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకుగాను శనివారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బాపట్ల జిల్లా ఇన్చార్జి ఆర్ఎం ఎం.రవికాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల ఆర్టీసీ డిపో పరిధిలోని చీరాల, పర్చూరు, ఇంకొల్లు, వేటపాలెం బస్స్టేషన్లలో ఓపెన్ ప్రదేశాల్లో 15 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 28వ తేదీ వరకు అప్లికేషన్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని, దరఖాస్తుదారులు 29వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోపు నెల్లూరులోని ఈడీ కార్యాలయంలోని టెండర్ బాక్సులో వేయాలన్నారు. చీరాల ఆర్టీసీ బస్టాండ్లో ఇప్పటికే ఖాళీ స్థలంలో హోటల్ నిర్మాణం జరిగిందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపి వ్యాపారాభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం ఆయన చీరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్గో పాయింట్, రిజర్వేషన్ కౌంటర్, ఖాళీ ప్రదేశాలను పరిశీలన చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్టీసీ డిపో మేనేజర్ జె.శ్యామల, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.