
ఉత్సాహంగా అండర్–23 క్రికెట్ టోర్నమెంట్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ అండర్– 23 వన్డే క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా సాగుతోంది. బుధవారం వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చిత్తూరు జట్టుపై 7 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చిత్తూరు జట్టు 45.1 ఓవర్లలో 217 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని రెడ్డి రుషిల్ 60, లోహిత్ లక్ష్మీనారాయణ 80 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్ 3, ప్రదీప్ రెడ్డి 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 218 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 25.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని కే హెచ్. వీరారెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శించి 125 పరుగులు (సెంచరీ) చేసి నాటౌట్గా నిలిచాడు. 69 బంతులను ఎదుర్కొని 14 బౌండరీలు, 7 బౌండరీ సిక్సులు సహాయంతో 125 పరుగులు చేశాడు. అర్జున్ టెండూల్కర్ 27 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని మహమ్మద్, రెడ్డి ప్రకాష్, డేనియల్ లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.
కేఎస్ఆర్ఎం మైదానంలో..
కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కడప జట్టుపై 13 పరుగుల తేడాతో నెల్లూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు 31.0 ఓవర్లలో 145 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్ రెడ్డి 28, అఖిల్ సాలుంకే 26 పరుగులు చేశారు. కడప జట్టులోని షేక్ ఆదిల్ హుస్సేన్ 4, చెన్నారెడ్డి 3, విజయ భావేంద్రారెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 146 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 37.4 ఓవర్లలో 132 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయి ఓటమి చవి చూసింది. ఆ జట్టులోని నాగ చాతుర్య 32, షేక్ ఆదిల్ హుస్సేన్ 40 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సాత్విక్ 3, సయ్యద్ అతిక్ సల్మాన్ 3, మాధవ్ 2 వికెట్లు తీసుకున్నారు.

ఉత్సాహంగా అండర్–23 క్రికెట్ టోర్నమెంట్