
రేషన్ పంపిణీలో అవకతవకలు తగదు
రాయచోటి టౌన్ : దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ పంపిణీ చేయాలని రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్ రేషన్ షాపు డీలర్లకు సూచించారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన రేషన్.. పరేషాన్ అనే కథనంపై ఆయన స్పందించారు. బుధవారం రాయచోటి పట్టణంలోని పలు రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపుల వద్ద డీలర్లు పంపిణీ చేస్తున్న విధానంలో తేడాలు గమనించి వారిని హెచ్చరించారు. తూకాలలో మోసం చేయరాదని అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కార్డుదారుడి వివరాలు గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ వద్ద ఉన్న పెన్షన్ ఆధారంగా సరి చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

రేషన్ పంపిణీలో అవకతవకలు తగదు