గుర్తు తెలియని వాహనం ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు

Jun 4 2025 1:45 AM | Updated on Jun 4 2025 1:45 AM

గుర్తు తెలియని వాహనం ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు

సిద్దవటం : రోడ్డు దాటుతున్న దంపతులను గుర్తు తెలియని వాహనం ఢీకొడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దవటం మండలం భాకరాపేట గ్రామానికి చెందిన నల్లగొండు చెన్నయ్య, ఆయన భార్య వెంకటమ్మ ఇరువురు సోమవారం రాత్రి భాకరాపేట గ్రామ శివారులోని శివాలయం వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొంది. దీంతో చెన్నయ్య తలకు గాయం కాగా, వెంకటమ్మకు ఎడమ కాలు విరిగింది. 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ మాట్లాడుతూ ఢీకొన్న వాహనం ఆచూకీ కోసం సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామన్నారు. హైవే రోడ్డు దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండి వాహనాల రాకపోకలను గమనించి రోడ్డు దాటాలని ఎస్‌ఐ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement