
కోవిడ్పై ప్రజలు ఆందోళన చెందవద్దు: ఉషశ్రీ
రాయచోటి: కోవిడ్–19పై జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని, దానిని ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఉషశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మదనపల్లెకు చెందిన నాగేంద్ర (27)కు కోవిడ్ పాజిటివ్గా తేలిందని చెబుతూ వాట్సప్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్పై స్పందించిన ఉషశ్రీ నాగేంద్రకు ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ తరువాతే కోవిడ్ నిర్ధారణ చేయగలుగుతామన్నారు.దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని తెలిపారు.
వైవీయూ పీజీ కళాశాల
ప్రిన్సిపల్గా ఆచార్య శ్రీనివాస్
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ టి. శ్రీనివాస్ నియమితులయ్యారు. విశ్వవిద్యాలయ వైస్–ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాస రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల పత్రాలను ఆచార్య శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ.. శ్రీనివాస్కు అందజేశారు. ప్రిన్సిపల్ పోస్టుతోపాటూ కడపలోని వై.వి.యు. హాస్టళ్ల చీఫ్ వార్డెన్గా బాధ్యతలు అప్పగించారు. ఇదివరకు ప్రిన్సిపల్ , వసతిగృహాల చీఫ్ వార్డెన్గా పనిచేసిన ఆచార్య ఎస్ రఘునాథ్ రెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో ఆ బాధ్యతల నుంచి ఆయన రిలీవ్ అయ్యారు.
మార్కెట్లకు వరదలా టమాట
బి.కొత్తకోట: ఉమ్మడి చిత్తూరుజిల్లాలోని వ్యవసాయ మార్కెట్యార్డులకు టమాట వరదలా వచ్చి పడుతున్నాయి. ధరల్లో పెరుగుదల లేనప్పటికి పంట దిగుబడులు భారీగా వస్తున్నాయి. దీంతో శనివారం ఒకరోజే 5,480 టన్నులు విక్రయానికి వచ్చాయి. మదనపల్లె మార్కెట్కు 1,750 టన్నులు, వి.కోట మార్కెట్కు 132, పలమనేరు మార్కెట్కు 460, పుంగనూరు మార్కెట్కు 1,568, ములకలచెరువు మార్కెట్కు 1,580, బి.కొత్తకోట మార్కెట్కు 25 , అంగళ్లు మార్కెట్కు 40 టన్నులు వచ్చాయి. కాగా ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో కిలో టమాట రూ.6.20 పైసలు, వి.కోటలో కిలో రూ.7, పలమనేరులో కిలో రూ.7.50 పైసలు, పుంగనూరులో కిలో రూ.6.70పైసలు, ములకలచెరువులో కిలో రూ.8.50 పైసలు పలికింది.
2న డీఈఈ సెట్ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: వైఎస్సార్ కడప జిల్లాలో డీఈఈ సెట్–2025 (కంప్యూటర్ బేస్డ్ టెస్టు) పరీక్ష జూన్ 2వ తేదీ 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నామని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సంబంధిత పరీక్ష మూడు సెంటర్లలో నిర్వహించనున్నామని తెలిపారు. డీఈఈ సెట్–25 అభ్యర్థులు హాల్ టికెట్లను https://apdeecet.apcfss.in/ వెబ్ సైట్లో డౌన్లోన్ చేసుకోవచ్చని తెలిపారు. నామినల్ రోల్స్ లో పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి ఏవైనా సవరణలు ఉంటే పరీక్షా కేంద్రంలో సరిదిద్దుకోవచ్చ న్నారు. హాల్ టికెట్తో పాటు అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు(ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు) తమ వెంట పరీక్ష హాల్కు తీసుకొని రావాలని తెలిపారు. అభ్యర్థులు వారికి సంబంధిత పరీక్ష తేదీ, సెంటర్ను సరిచూసుకుని నిర్ణీత సమయంకంటే అరగంట ముందే పరీక్ష సెంటర్కు హాజరుకావాలని డీఈఓ తెలిపారు.
బాలల కార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా చర్యలు చేపట్టాలి
రాయచోటి: బాలలు, కౌమార కార్మీక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జూన్ 1 నుంచి 30వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా టాస్క్ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ, పునరావాస ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. శనివారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి చేపట్టనున్న బాలల, కమార దశ పిల్లల సంరక్షణ, పునరావాస ప్రచార కార్యక్రమంపై కార్మిక, పోలీసు, విద్య, వైద్య తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కార్మీకశాఖ జిల్లా అధికారి రంగరాజు జిల్లాలో జరగబోయే బాలల సంరక్షణ, పునరావాస ప్రచార కార్యక్రమాలు గురించి పలు విషయాలను కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాలల సంరక్షణ, వారి పునరావాసమే ధ్యేయంగా జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ పనిచేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ కార్మీక శాఖ ఆధ్వర్యంలో బాల, కౌమార కార్మీక వ్యవస్థ చట్టం 1986, సవరణ చట్టం 2016పై రూపొందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పోలీసు శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎన్డీఓల ప్రతినిధులు పాల్గొన్నారు.