కడపకు తిరుమల సెలవు! | - | Sakshi
Sakshi News home page

కడపకు తిరుమల సెలవు!

May 31 2025 1:35 AM | Updated on May 31 2025 1:35 AM

కడపకు తిరుమల సెలవు!

కడపకు తిరుమల సెలవు!

రాజంపేట: తిరుమల ఎక్స్‌ప్రెస్‌(17487/ 88) రైలు ఇక కడపకు సెలవు చెప్పింది. వచ్చేనెల 2వ తేదీ నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు కడప నుంచి గుంతకల్‌ ఎక్స్‌ప్రెస్‌(స్పెషల్‌)రైలుగా మారనుంది. అయితే పార్మిసిన్‌లో ఉన్న ఏసీ బోగీలను మూసివేస్తారు. ఈరైలు అన్‌రిజర్వ్‌డ్‌గా నడవటం వల్ల కేవలం రిజర్వేషన్‌, జనరల్‌ బోగీలు మాత్రం ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 07521/07522 నంబర్లతో తిరుమలను గుంతకల్‌రైలుగా నడిపిస్తున్నారు.ఉభయ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుంతకల్‌ వెళ్లేందుకు ఉభయ వైఎస్సార్‌ కడప జిల్లా వాసులకు ఉపయోగకరమవుతుంది.

తిరుమలకు వెంటాడుతున్న

లాంగ్‌ట్రైన్‌ కష్టాలు

సర్కారు ఏరియాకు ఉన్న ఏకై క ఎక్స్‌ప్రెస్‌ రైలును డివిజన్‌ కేంద్రానికి తరలించేశారు. ఇప్పటికే కడప రైల్వేలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందన్న విమర్శలు రైల్వేశాఖను తాకుతున్నాయి. విశాఖ –తిరుపతి మధ్య నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలును కడప వరకు పొడిగింపు జిల్లా ప్రయాణికులకు ఊరటే . ఇప్పుడు ఆరైలును డివిజన్‌ కేంద్రమైన గుంతకల్‌ వరకు పొడిగించాలనే అధికారులు చేసిన ప్రతిపాదనలు అమలయ్యాయి. తిరుమలకు లాంగ్‌ట్రైన్‌ కష్టాలు వెంటాడునన్నాయి. తిరుమల రైలు పొడిగింపును సాక్షి ముందుగానే వెలువరించిన సంగతి విధితమే.

● తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ఇప్పటి వరకు 872 కిలోమీటర్‌ వరకు పొడిగింపుతో నడిచేది. గుంతకల్‌ పొడిగింపుతో అది కాస్తా 184 కి.మీ దూరం పెరిగింది. దీంతో 1056 కి.మీ దూరం నడుస్తోంది. తిరుమల ఫార్మసిన్‌కు గుంతకల్‌లో క్లీనింగ్‌, వాటరింగ్‌ నిర్వహించనున్నారు.అప్‌, డౌన్‌ 2, 112 కిలోమీటర్ల దూరం తిరుమల రైలు రన్నింగ్‌ కొనసాగనుంది.

హాల్టింగ్స్‌ ఇలా..: గుంతకల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కడప నుంచి ప్రారంభమవుతుంది. ఎర్రగుంట్ల, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్‌ లో హాల్టింగ్స్‌ ఇచ్చారు. ఈ రైలు కడపలో ఉద యం 7.45 గంటలకు బయలుదేరి, ఎర్రగుంట్లకు 8.13 గంటలకు, కొండాపురానికి 08.39కి చేరుకుంటుంది. తాడిపత్రికి 9.15, గుత్తి 10.03, గుంతకల్‌కు 11.15 గంటలకు చేరు కుంటుంది. తిరిగి గుంతకల్‌లో 1.30గంటలకు బయలుదేరుతుంది. గుత్తికి 01.55 గంటలకు చేరుకుంటుంది. తాడిపత్రికి 02.40గంటలకు, కొండాపురానికి 03.13గంటలకు చేరుకుంటుంది. 3.43 గంటలకు ఎర్రగుంట్ల , కడప 5.15 గంటలకు చేరుకుంది. అక్కడి నుంచి తిరుమల రైలుగా విశాఖకు బయలుదేరుతుంది.

● డివిజన్‌ కేంద్రమైన గుంతకల్‌కు వెళ్లేందుకు రైల్వే ఉద్యోగులకు, కార్మికులకు గుంతకల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అనుకూలమని అంటున్నారు. అలాగే తాడిపత్రి, గుంతకల్‌ వెళ్లే ప్రయాణికులకు ఇంటర్‌సిటీ కాకుండా ఈ రైలులో వెళ్లే పరిస్థితులే అధికంగా ఉంటాయి.

కడప నుంచి గుంతకల్‌ రైలుగా..

జిల్లా కేంద్రం నుంచి ఏకై క ఎక్స్‌ప్రెస్‌ రైలు తిరుమల ఎక్స్‌ప్రెస్‌. ఇప్పుడు అది గుంతకల్‌ వరకు వెళుతోంది. గుంతకల్‌ నుంచి సర్కారు ప్రాంతా నికి అనేక రైళ్లు ఉన్నాయి. సర్కారు ప్రాంతానికి ఇప్పుడు కడప నుంచి నడిచే ఏకై క ఎక్స్‌ప్రెస్‌ రైలును కూడా గుంతకల్‌కు తీసుకెళ్లడంపై ఉభయజిల్లా వాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

గుంతకల్‌కు పొడిగింపు

2న పట్టాలెక్కనున్న గుంతకల్‌ రైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement