ఫారంపాండ్‌ పనుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఫారంపాండ్‌ పనుల తనిఖీ

May 1 2025 2:03 AM | Updated on May 1 2025 2:03 AM

ఫారంపాండ్‌ పనుల తనిఖీ

ఫారంపాండ్‌ పనుల తనిఖీ

సుండుపల్లె : మండల పరిధిలోని ఈడిగపల్లె, మాచిరెడ్డిగారిపల్లె గ్రామాల్లో నిర్మించిన ఫారంపాండ్‌, పశువుల నీటితొట్లు, ఊటకుంట పునరుద్ధరణ పనులను డ్వామా పీడీ వెంకటరత్నం బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లలో నీరు తక్కువ వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా చెట్ల పెంపకానికి ఫారంపాండ్లు, పశువుల దాహార్తిని తీర్చడానికి నీటితొట్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఉపాధిహామీ పథకం ద్వారా 5 ఎకరాల్లోపు ఖాళీ భూమి ఉన్న రైతులకు ఉద్యాన శాఖ ద్వారా 24 రకాల ఉద్యాన మొక్కలు పెంచుకొనేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ మాలిక్‌బాషా, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement