
నేడు కొలువుతీరనున్న గంగమ్మ
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కోడూరు గంగమ్మ జాతర నేడు గురువారం జరగనుంది. ఉదయం 5 గంటలకు పొట్టి శ్రీరాముల వీధిలోని అంకాలమ్మ గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకొస్తారు. గంగమ్మ మిట్టలో గంగమ్మ కొలువుతీరనుంది. ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అలాగే ఉదయం వసంతోత్సవంతో గంగమ్మను ఉంగరాల నగర్ వద్ద నిమజ్జనం చేయనున్నారు. ఈ ఏడాది ఎటువంటి వీఐపీ పాస్లు లేకుండా అమ్మవారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. జాతర నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు డప్పు వాయిద్యాలు, చెక్కభజన కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.