
సబ్ జైలులో సౌకర్యాలపై ఆరా
● నిందితులతో మాట్లాడిన న్యాయమూర్తి
అనకాపల్లి టౌన్: స్థానిక సబ్ జైల్లో నిందితులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవ అధికారి ధర్మారావు ఆరా తీశారు. పదో అదనపు జిల్లా జడ్జి నరేష్ ఆదేశాల మేరకు సాధారణ పరిశీలనలో భాగంగా సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తి నిందితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలు ఉంటే డాక్టర్కు చూపించాలని జైలు అధికారులను ఆదేశించారు. బెయిల్ కోసం న్యాయ సహాయకులను ఉపయోగించుకోవాలని సూచించారు. జైల్ సూపరింటెండెంట్ కిరణ్, న్యాయ సహాయకులు తులసి, సాయిరాం, ఎంఎల్ఎస్సీ ప్రతినిధి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.