200 రోజులు ‘ఉపాధి’ కల్పించాలి | Sakshi
Sakshi News home page

200 రోజులు ‘ఉపాధి’ కల్పించాలి

Published Wed, Mar 27 2024 12:05 AM

-

ఎదులాపురం: ఉపాధి హామీ చట్టం కింద 200 రోజులు పని కల్పించాలని అఖిల భారత ప్రగతిశీల కిసాన్‌ మజ్దూర్‌ సంఘం జిల్లా కార్యదర్శి కొడప సురేశ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా భవనంలో మంగళవారం సంఘం జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టం కింద 200 రోజులు పని కల్పించాలని, కూలీలకు రోజు కూలి రూ.600 అందించాలన్నారు. అలాగే వేసవిలో మెడికల్‌ కిట్‌, టెంటు, తాగునీరు, పనిముట్లు వంటివి సరఫరా చేయాలన్నారు. ఇందులో సంఘం నాయకులు జుగదిరావ్‌, బుచ్చిరాం, సురేశ్‌, శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement